ఆమదాలవలసలో జనంతో జనసేన కార్యక్రమం 31వ రోజు
ఆమదాలవలస నియోజవర్గం: ఉవ్వ పేట గ్రామంలో జనంతో జనసేన 31వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు కొత్తకోట. నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, ఎంపీటీసీ విక్రమ్, కార్యకర్తల ఆధ్వర్యంలో గడప గడప కి వెళ్లి సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ సిద్ధాంతాలును తెలియజేస్తూ.. గ్రామంలో ఉన్న ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా తెలుసుకొన్న ముఖ్యమైన సమస్యలు కాలువలు లేకపోవడం, ఇంటి ముందు, రోడ్లు మీద మురికి నీరు నిల్వవుండడం వలన, ప్రజలు, పిల్లలు అనారోగ్యంనికి గురి అవుతున్నారు. ఈ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు జనసేన పార్టీ పోరాడుతుందని గ్రామ ప్రజలకు బరోసా ఇవ్వడం జరిగింది. ఈ జనంతో జనసేన కార్యక్రమంలో పాల్గొన్న నాయుకులు అసిరినాయుడు, మహేష్, కోమల్రావు, రుద్ర, ప్రదీప్, అనిల్, వినోద్, సాయి, మోహన్, కార్యకర్తలు. మరియు ఉవ్వపేట గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా జనసేన తరపున హృదయపూర్వక ధన్యవాదములు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-28-at-5.51.13-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-28-at-5.51.14-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-28-at-5.51.14-PM-1-1024x768.jpeg)