జనంకోసం జనసేన – మహా పాదయాత్ర 35వ రోజు
రాజానగరం నియోజకవర్గం, జనంకోసం జనసేన – మహా పాదయాత్ర 35వ రోజులో భాగంగా… రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం, కొత్త వెలుగుబంద గ్రామంలో ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగింది. రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, జనశ్రేణులు సంయుక్తంగా జనసేన పార్టీ విధి విధానాల ముద్రించిన కరపత్రాలు పంచుతూ, నిస్వార్ధపరుడు, నీతి, నిజాయితీకి నిలువుటద్దంలా ఉండే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ కి ఈసారి అవకాశం ఇవ్వాలని, చాప కింద నీరులా రాష్ట్రం నలుమూలల ప్రజాదరణతో రోజురోజుకీ బలపడుతున్న జనసేన పార్టీని, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రజలు సహకరించాలని జనసేన ప్రభుత్వం వస్తే ప్రజలకు జరిగే మేలును, సమాజంలో వచ్చే మార్పును వివరిస్తూ, గ్రామంలో ప్రజల ఆదరణతో ఈ పాదయాత్ర ముందుకు సాగింది. జనసేన మహా పాదయాత్రలో తూర్పుగోనుగూడెం సర్పంచ్ గళ్ళ రంగా, చిట్టిప్రోలు సత్తిబాబు, కానవరం రామకృష్ణ, ముఖ్య నాయకులు పల్లకడియం జనసేన పార్టీ అధ్యక్షులు వేమవరపు వెంకటేశ్వర్లు, వేమవరపు సుబ్రహ్మణ్యం, బొర్రా చిన్ని బాబు, గెడ్డం శ్రీను, రొక్కల సుబ్బారావు, వి. సుబ్రహ్మణ్యం, రొక్కాల కిట్టయ్య, కస్తూరి బద్రి, బుర్ర గోపాలం, వేమవరపు యేసు, విజ్ఞ చంటి, వేమవరపు సుబ్రహ్మణ్యం, వెంకి శ్రీను, విజ్ఞ అబ్బాస్, వి.శ్రీను, తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-29-at-19.24.05-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-29-at-19.24.07-1024x582.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-29-at-19.23.58-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-29-at-19.24.00-1024x768.jpeg)