యడమ రాజేష్ ఆధ్వర్యంలో 3వ రోజు ఇంటింటికి జనసేన
తెలంగాణ, జనసేన పార్టీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ యడమ రాజేష్ ఆధ్వర్యంలో మొదలైన ఇంటింటికి జనసేన కార్యక్రమం శనివారం 3వ రోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ యడమ రాజేష్ ఇంటింటికి తిరుగుతూ జనసేన సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచిపెడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-07-at-14.47.38-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-07-at-14.47.38-1-1024x768.jpeg)