జనసేన జనజాగృతి యాత్ర 44వ రోజు..
- జనసేన ఆడపడుచు గంటా స్వరూప దేవికి ఘన స్వాగతం పలికిన సింగవరం గ్రామస్థులు
రాజానగరం: జనసేన జనజాగృతి యాత్ర 44వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం సీతానగరం మండలం సింగవరం గ్రామంలో జరిగింది. బుధవారం కార్యక్రమంలో భాగంగా 500 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 42,500 గాజు గ్లాసులు పంపిణీ కార్యక్రమం రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ &ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ఆదేశాల మేరకు దిగ్విజయంగా ముందుకు సాగుతూ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ జండా ఎగరేసే విధంగా ముందుకు సాగిపోతుంది.. కార్యక్రమంలో భాగంగా జనసేన ఆడపడుచు & జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవికి గ్రామ గ్రామన ప్రతి ఇంటింకి వెళ్లి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం కరపత్రాలు ప్రజలకు అందిస్తూ… జనసేన పార్టీ ని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల కన్వీనర్ జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, సీతానగరం మండల కో-కన్వీనర్ కాత సత్యనారాయణ, కోరుకొండ మండల జనసేన పార్టీ నాయకులు తెలగంశెట్టి శివ, తన్నీరు తాతాజీ, చల్లా ప్రసాద్, సింగవరం జనసేన పార్టీ నాయకులు అప్పయమ్మ (ప్రసాద్ ), బెజవాడ సాయి, ఒదిరి సురేష్, సింగిశెట్టి సాయి, పినిశెట్టి బాలు, తురం రాజు, ముళ్ల దుర్గా ప్రసాద్, సత్య మురళి, ముసిరి శివ, రమేష్, గణేష్, సతీష్, గంగిశెట్టి రాజ్ కుమార్, మునీంద్ర, గట్టి సాయి, చిడిపి వంశీ, కొమ్మిరెడ్డి తులసి రామ్, పి. మణికుమార్, హరికృష్ణ, శివ మరియు వీరామహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-25-at-9.02.31-PM-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-25-at-9.02.31-PM-1-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-25-at-9.02.32-PM-1024x576.jpeg)