లక్ష్మణరావు కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేత

రాజమండ్రి రూరల్: జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు చల్ల లక్ష్మణరావు ఇటీవల మరణించగా జరిగింది. విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, క్రియాశీల సభ్యత్వం కలిగి ఉన్న జనసైనికుడు లక్ష్మణరావు ఇన్సూరెన్స్ క్లెయిమ్ నిమిత్తం పూర్తి సమాచారాన్ని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్, చనిపోయిన కార్యకర్త యొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్కుని జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ కు పంపించి లక్ష్మణరావు కుటుంబసభ్యులకు అందజేయవలసినదిగా సూచించారు. ఈ మేరకు బుధవారం జనసేన ద్వారా 5 లక్షలు రూపాయల చెక్కుని కందుల దుర్గేష్ చేతులమీదుగా లక్ష్మణరావు కుటుంబసభ్యులకు చెక్కుని అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి నగర అధ్యక్షులు వై శ్రీను, రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అను శ్రీ సత్యనారాయణ, రామచంద్రపురం ఇంచార్జ్ చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి ఘంటా స్వరూప, తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి, రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి చిక్కాల బాబుల్, జిల్లా అధికార ప్రతినిధి యామన నారాయణ గౌడ్, జిల్లా కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శులు షేక్ అమీనా, బీర ప్రకాష్, రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు చప్పా చిన్నారావు, కడియం మండలం అధ్యక్షులు ముద్రగడ జమ్మి, మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.