క్రియాశీలక సభ్యుని కుటుంబానికి 5 లక్షల భీమా చెక్కు అందజేత

ఎల్ బి నగర్ నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎల్ బి నగర్ జనసేన ఇంఛార్జి శ్రీమతి పొన్నూరు శిరీష ఆధ్వర్యంలో వెంకట సాయి ప్రసాద్ సమక్షంలో ఇటీవల మరణించిన క్రియాశీలక సభ్యులు మిరియాల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి, పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచి ఇచ్చిన 500000/ ఐదు లక్షల చెక్కును అందజేయడానికి వచ్చిన రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాదారం రాజలింగం లకు ఎల్ బి నగర్ జనసేన నాయకులు, జనసైనికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాదారం రాజలింగం క్రియాశీలక సభ్యులు మిరియాల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి, 5 లక్షల చెక్కును అందజేసారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విరమహిళల ఛైర్మెన్ మండపాక కావ్య, తెలంగాణ రాష్ట్ర నాయకులు, విరమహిళలు, నియోజకవర్గ ఇంచార్జీలు, ఎల్బి నగర్ నియోజకవర్గ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.