జనసేన జనజాగృతి యాత్ర 51వ రోజు

  • రాజానగరంలో జనసేన తరుపున ఎవరు పోటీ చేసినా జనసేన గెలుస్తుంది: మండపాక శ్రీను

రాజానగరం, జనసేన జనజాగృతి యాత్ర 51వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం కోరుకొండ మండలం గుమ్ములూరు గ్రామంలో 2వ రోజు హరిజన పేటలో శనివారం కార్యక్రమంలో భాగంగా 300 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 47,700 వేల గాజు గ్లాసులు పంపిణీ కార్యక్రమం జరిగింది. రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు మండపాక శ్రీను అధ్యక్షతన దిగ్విజయంగా ముందుకు సాగుతూ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ జెండా ఎగరేసే విధంగా ముందుకు సాగిపోతుంది. గ్రామ గ్రామాన ప్రతి ఇంటింకి వెళ్లి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం కరపత్రాలు ప్రజలకు అందిస్తూ జనసేన పార్టీని, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, కోరుకొండ మండలం జనసేన ప్రధాన కార్యదర్శి వీరపురాజు పోసిబాబు, రాచపోతుల సురేష్, తన్నీరు తాతాజీ, బాబు వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.