మదనపల్లెలో జనసేన-టిడిపి ప్రచారం 58వ రోజు

మదనపల్లె: 58వ రోజు జనసేన పార్టీ ప్రచారంలో భాగంగా ఎస్ బి ఐ కాలనీ గొల్లపల్లి రోడ్డు పరిసర ప్రాంతాలలో ప్రచారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు నా సేన నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ శ్రీమతి దారం అనిత ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్, కొణిదెల శంకర్ బాబు కోటకొండ చంద్రశేఖర్, ఆకుల శంకర, అశ్వత్ రాయల్, ధరణి కుమార్ రాయల్, జనసేన సోను, సుప్రీం హర్ష, యాసీన్, నవాజ్, బహదూర్, చంద్రశేఖర్ పద్మావతి నీరు గట్టుపల్లి శేఖర్ తదితరులు పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.