జనసేన మహా సంకల్పయాత్ర 5వ రోజు
అమలాపురం నియోజకవర్గంలో కామన గరువు పంచాయతీలో బాలయోగి కాలనీ 9,10 వార్డులలో ఇంటింటికి కరపత్రాల పంపిణీ జరిగింది. అలాగే కొంతమంది కార్యకర్తలకు నియోజకవర్గం నాయకులు లింగోలు పండు క్రియాశీలక సభ్యత్వాల కోసం వివరించి నమోదు చేయడం జరిగింది. అలాగే దీర్ఘ కాళిక సమస్యలైన డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల సమస్యలపై, మరియు స్థానికంగా ఎన్నో సమస్యలు స్థానిక మహిళలు తెలియజేశారు. ఈ ఆ సమస్యల పరిస్కారానికి జనసేన పార్టీ కృషి చేస్తుందని, తెలియ చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యక్రమంలో డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి బట్టు పండు, మునిసిపల్ కౌన్సిలర్ పడాల నానాజీ, నాయకులు నల్లా వెంకటేశ్వరావు, వాకపల్లి వెంకటేశ్వరావు, నిమ్మకాయల రాజేష్, అల్లాడ రవి, సాధనాల మురళి, నల్లా చిన్న, నందుల సత్తిబాబు, గొలకొటి చిన్న, మామిడిపల్లి సుబ్బారావు, రాజా, పాలూరీ స్వామి నాయుడు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-24-at-5.00.04-PM-1024x461.jpeg)