జనం కోసం జనసేన మహాయజ్ఞం 647వ రోజు
జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 647వ రోజు కార్యక్రమం శనివారం గోకవరం మండలం, మల్లవరం గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 648వ రోజు కార్యక్రమం ఆదివారం గోకవరం మండలం మల్లవరం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మల్లవరం గ్రామ అధ్యక్షులు గంటా వీరబాబు (జి.వి నాయుడు), కర్ణం బుజ్జి, గుండు అశోక్, చింతపల్లి మౌళి, బొద్దపు నాగు, యలంశెట్టి వేణు, గుర్రం వీరవిష్ణు, గుర్రం వెంకటేష్, రంపా స్వామీ, గుర్రం వీరబాబు, దండుపాటి దుర్గాప్రసాద్, శివరామపట్నం నుండి గ్రామ అధ్యక్షులు గాబు రామక్రిష్ణ, మండపాక సర్వేశ్వరరావు, గాబు శంకర్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా మల్లవరం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కోమరపు శివ కుటుంబ సభ్యులకు, ద్వారపూడి కృష్ణ కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/d-1-1024x576.jpg)