పోలవరం నియోజకవర్గంలో జనం కోసం జనసేన 77వ రోజు

పోలవరం నియోజకవర్గం, వేలేరుపాడు మండలం, వేలేరుపాడు టౌన్ లో మండల అధ్యక్షులు ఆదినారాయణ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమం 77వ రోజు ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ కార్యకమంలో పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు ప్రజలతో మమేకమవుతూ వారిని పలకరిస్తూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను మేనిఫెస్టో ప్రజలలోకి తీసుకువెళ్తూ వివరించడం జరిగింది. గత 4 సంవత్సరాల క్రితం నమ్మించి మోసం చేసి గద్దె ఎక్కిన ప్రభుత్వం ఈ నాటికి పోలవరం నిర్వాశితులను పట్టించుకోలేదని, 10 లక్షల ప్యాకేజీ ఇస్తాను అని చెప్పి 4-6 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటుందని, తెల్లం బాలరాజు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు ఏమైయ్యాయి అని, తెల్లం బాలరాజు బయటకు వస్తే ప్రజలు కొట్టే పరిస్థితి అని అందుకే బయటకు రాని ఈ పిరికి వాళ్ళ మనకు నాయకులా అని ప్రశ్నించారు. అందరికి న్యాయం జరిగేలా జనసేన అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మేచినేని సంజయ్, కొవ్వాలా క్రాంతి, పట్టాల సత్తిబాబు, దేవి రెడ్డి సుధాకర్ శ్రీనివాస్, రెడ్డి, వీరమహిళ పార్వతి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.