పోలవరం నియోజకవర్గంలో జనం కోసం జనసేన 79వ రోజు
పోలవరం: బుట్టాయిగూడెం మండలం, ముద్దప్పగూడెం గ్రామంలో జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన 79వ రోజు కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ, మేనిఫెస్టో వివరించారు. గ్రామంలో ప్రధానంగా రోడ్ సదుపాయం లేదని, నీటి సమస్య అధికంగా ఉందని, ఒంటరి మహిళలకు, వృద్దులకు ఫించను రావడం లేదని, ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని, తమ భాదను చిర్రి బాలరాజు గారికి గ్రామస్థులు చెప్పుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. మీ సమస్యలకు ఒకటే పరిష్కారం, అది ఒక్క జనసేన ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. పోలవరంలో జనసేన రావడం తథ్యమని, అందరికి బుద్ది చెప్పే రోజులు ముందే ఉన్నాయని చిర్రి బాలరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో మాదేపల్లి శ్రీను, ఇరపా రాంబాబు, తామ రాంప్రసాద్, ఇరపా దుర్గాప్రసాద్, కుంజా అశోక్, కోటం పవన్ కళ్యాణ్, చింటూ, ఫణి, కుంజా కిట్టుబాబు, కుంజా రాముడు, పదిలం సాయి మరియు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-06-at-3.06.50-PM-1024x461.jpeg)