జనసేన మహా సంకల్ప యాత్ర 7వ రోజు

అమలాపురం రూరల్ మండలం, జనసేన పార్టీకి ఒక్క అవకాశం.. జనసేన మహా సంకల్ప యాత్ర.. 7వ రోజు కార్యక్రమాన్ని అమలాపురం రూరల్ మండలం బట్నవిల్లి గ్రామంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతీంటికి అధ్యక్షుల వారి సిద్ధాంతాలను మనోగతాలను వివరిస్తూ ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయ సాధనలు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ చేయబోయే వివిధ కార్యక్రమాలు పేద ప్రజలకు చేయబోయే మంచి పనుల గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల కుటుంబాలకి లక్ష రూపాయల ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలను ప్రతీఇంటికి వివరిస్తూ, 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు లింగోలు పండు, పార్టీ సీనియర్ నాయకులు కంచిపల్లి అబ్బులు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, ఆర్.డి.ఎస్ ప్రసాద్, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి బట్టు పండు, నల్లా వెంకటేశ్వరావు, అల్లాడ రవి, నల్లా చిన్న, సాధనాల మురళి, పాలురి నారాయణ స్వామి, ముస్లిం మైనారిటీ సభ్యులు కరిముళ్ళబాబా, షరీఫ్ కర్రి, వీరబాబు, వీరమహిళ వానపల్లి దేవి తదితరులు పాల్గొన్నారు.