జనంకోసం జనసేన మహాపాదయాత్ర 8వ రోజు

రాజానగరం నియోజకవర్గం, 8వ రోజు “జనంకోసం జనసేన మహాపాదయాత్ర” రాజానగరం మండలం, శ్రీరామ్ నగర్ లో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి ల ఆధ్వర్యంలో సర్పంచ్ గళ్ళ రంగారావు పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను వివరిస్తూ జనసేన పార్టీకి ఈసారి ఒక అవకాశం ఇవ్వాలని జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తిచేస్తూ జనసేన పార్టీ విధివిధానాలు ముద్రించిన కరపత్రాలు పంచడం జరిగింది. ఈ జనంకోసం జనసేన పాదయాత్ర కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.