జనసేన జన జాగృతి యాత్ర 93వ రోజు
- గురుదత్ గారికి అడుగడుగునా జననీరాజనం పట్టిన నర్సాపురం గ్రామ ప్రజలు
- జనసేన పార్టీ బలం జనసైనికులే గురుదత్
రాజానగరం: జనసేన జనజాగృతి యాత్ర 93వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం కోరుకొండ మండలం, నర్సాపురం గ్రామం లో ఈరోజు కార్యక్రమంలో భాగంగా 700 గాజు గ్లాసులు పంపిణి చెయ్యటం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 56,700 వేల గాజు గ్లాసులు పలు గ్రామాల్లో ఇవ్వటం జరిగింది. జనసేన జన జాగృతి యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ &ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ అధ్యక్షతన దిగ్విజయంగా ముందుకు సాగుతూ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ జండా ఎగరేసే విధంగా ముందుకు సాగిపోతుంది.. గ్రామ గ్రామన ప్రతి ఇంటికీ వెళ్లి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం కరపత్రాలనూ ప్రజలకు అందిస్తూ.. జనసేన పార్టీని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ వీరమహిళ కందికట్ల అరుణ కుమారి, చదువు ముక్తేశ్వరరావు, తన్నీరు తాతాజీ, పోసిబాబు, పేమ్మడ సతీష్, కూనవరం జనసేన పార్టీ నాయకులు గేదల సత్తిబాబు, చిక్కాల నాగు, నర్సాపురం జనసేన పార్టీ నాయకులు బొజ్జపు సత్యనారాయణ, ప్రగడ దేవి వరప్రసాద్, మట్ట నాగేశ్వరరావు, అడ్డాల దుర్గారావు, ఇనకోటి నాగు, చోంగ పండు, దాకారపు వీరబాబు, నాసంశెట్టి శివ, వీరమహిళలు మరియు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-09-at-7.30.52-PM-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-09-at-7.30.53-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-09-at-7.30.54-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-09-at-7.30.54-PM-1-1024x580.jpeg)