గూడెం కొత్తవీది మండలాల జనసేన నాయకుల అత్యవసర సమావేశం

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు: జనసేన పార్టీ గ్రామపర్యటన షెడ్యూల్ నిర్ణయింపు సమావేశంలో భాగంగా శుక్రవారం పాడేరు, గూడెం కొత్తవీది మండలాల నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన డా. వంపూరు గంగులయ్య ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముందుగా నియోజకవర్గ పరిధిలోని పలుగ్రామలనుంచి స్వచ్ఛందంగా సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా పిలుపు స్వయంగా ప్రజలనుంచి రావడం జనసేన పార్టీకి లభిస్తున్న ఆధారణకి ఒక ఉదాహరణ మాత్రమేనని అలాగే మీయొక్క మండలంలోని గ్రామాల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు లక్ష్యాలు ఆదివాసీ ప్రజలకు ప్రస్తుత రాజకీయాలు వివరిస్తూనే వారికి చైతన్యం చెయ్యాల్సిన బాధ్యతలు మీపై ఉందని తెలిపారు. పార్టీ బలోపేతానికి అలుపెరగని సైనికులవలె పనిచేయాల్సిన సమయమిదేనని అన్నారు. మనం జనసేనపార్టీ ద్వారా ఆదివాసీ ప్రజల క్షేమాన్ని కోరే రాజకీయాలకు అంకురార్పణ చేశామని ఒకరకమైన అవినీతి ధనబలం గలా రాజకీయశక్తులకు దీటుగా పోరాడుతున్నామని గ్రహించాలని మండలాలవారిగా జనసైనికులు, నాయకుల మధ్య సమన్వయంతో పనిచేయాలని పాడేరు, గూడెం మండలాల నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పాడేరు మండల నాయకులు లీగల్ సెల్ అడ్వైజర్ కిల్లో రాజన్, మజ్జి నగేష్, అశోక్, గూడెం మండల నాయకులు కొయ్యమ్ బాలరాజు,కూడా మదుకుమార్, కోటి, ఈశ్వర్రావు తదితర జనసైనికులు పాల్గొన్నారు.