డొక్కా సీతమ్మ అన్నసదుపాయ కేంద్రం నిర్వహణ 5వ వారం
పిఠాపురం పశువుల సంత నందు ప్రతి వారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదర్శంతో నిర్వహిస్తున్న శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నసదుపాయ కేంద్రం నందు శనివారం ఉదయం 11-30గంటల నుండి రైతులకు, పశువుల బేరాల మద్యవర్తులకు, వివిద హాస్పటల్ ఔట్ పేషెంట్ లకు కలిపి 690 మందికి అన్నసదుపాయంను నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు కల్పించారు. పిఠాపురం పట్టణ జనసేన నాయకులు అల్లం కిషోర్, వేమనమంది కృష్ణంరాజు, కర్రి కొండలరావు, అల్లం శ్రీను, రెడ్డి మనోహర్, అల్లం వాసు, బొత్స శ్రీకాంత్, ముత్యాల రాజు, రాయవరపు నవదీప్, జ్యోతుల నాని, విప్పర్తి శ్రీను, మేడిబోయిన హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-20-at-6.43.04-PM-1024x576.jpeg)