సత్తెనపల్లి జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ చలివేంద్రం ఏర్పాటు

సత్తెనపల్లి నియోజకవర్గం, సత్తెనపల్లి టౌన్ నందు శనివారం జనసేన పార్టీ ఏడో వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్ కుమార్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ వారి కార్యాలయం ఎదురుగా డొక్కా సీతమ్మ గారి మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ విక్రమాన్ని స్థానిక నాయకులు సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు చేతుల మీద ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమం ప్రారంభించి అందరికీ మంచినీరు మజ్జిగ పెరుగు అన్నం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొర్రా మాట్లాడుతూ.. ఎండ్ల తీవ్రతతో ప్రజలు మరింత దాహాద్రి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గాడిచిన వారం నుండి ఎండలు విపరీతంగా ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్పితే బయటికి రావద్దని వచ్చిన తగు జాగ్రత్తలు తీసుకొని రావాలని ప్రభుత్వం ప్రజలకు ఎండ ఇబ్బందులు కలగకుండా కొన్ని షెల్టర్లు మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, కౌన్సిలర్ సుమన్ కుమార్, నాలుగు మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, నాదెండ్ల నాగేశ్వర, తోట నరసయ్య తాడువాయి తదితరులు పాల్గొన్నారు.