స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఆవిష్కరణ

ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గంలోని మారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఆవిష్కరణలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నటువంటి వంగవీటి రాధాకి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు ఘనస్వాగతం పలికి, కార్యక్రమంలో ప్రతిక్షణం వంగవీటి రాధాతోనే అడుగులు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలగ, కాపు, బలిజ ఐక్య కార్యాచరణ సమితి దక్షిణ భారత కన్వీనర్ దాసరి రాము దాసరి రాము ఇతర నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.