టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందించండి.. మున్సిపల్ కమిషనర్ కు డాక్టర్ పిల్లా శ్రీధర్ వినతిపత్రం

  • నాలుగు సంవత్సరాలు పూర్తయిన లబ్ధిదారులకు అందని టిడ్కో గృహాలు

పిఠాపురం: గత ప్రభుత్వ హయాంలో పిఠాపురం పట్టణంలో పేద ప్రజల కోసం నిర్మించిన టిడ్కో గృహాలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ నందు నిరసన తెలియపరచడం జరిగింది. అనంతరం సంబంధిత మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పిఠాపురం పట్టణంలో పదివేల పేద కుటుంబాల కోసం నిర్మించిన టిడ్కో గృహాలు 90% పూర్తి చేసిన గాని ఈ ప్రభుత్వం వారు మిగిలిన 10% పనులను ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయిన కానీ మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేదని దీని కారణంగా లబ్ధిదారులు అద్దె ఇంట్లో అవస్థలు పడుతూ అద్దెలు కట్టలేక టిడ్కో గృహాలకోసం కట్టిన లక్షల రూపాయలకు వడ్డీ కట్టలేక అవస్థలు పడుతున్నారని, తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి లబ్ధిదారులకు అందించాలని, వీరు రంగుల మీద పెట్టే శ్రద్ధ మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయడం మీద పెట్టుంటే ఈపాటికి ప్రతి పేద లబ్ధిదారుడికి ఇల్లు అంది ఉండేది. ఇకమీదటైనా దయచేసి ఆ మిగతా 10% పనులు పూర్తిచేసి అందించాలని ప్రభుత్వాన్ని డాక్టర్ పిల్లా శ్రీధర్ డిమాండ్ చేశారు. లేనియెడల జనసేన పార్టీ వైపు నుంచి ఉద్యమం చేపడతామని డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, వెన్నపు చక్రధర్, ఎక్స్ సర్పంచ్ గరగ సత్యానందం, వంక కొండబాబు, బొజ్జ గోపికృష్ణ, పల్నాటి మధుబాబు, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, బొంతల వెంకటరావు, గుర్రం గంగాధర్, కేసిరెడ్డి బుల్లి రాజు, పిల్లా శ్రీను, కోనా రాము, కే కామేష్, ఎం చిట్టిబాబు, సైతం రాజబాబు, పేరపు కృష్ణంరాజు, జీను శ్రీను మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.