మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులచే మజ్జిగ చలివేంద్రం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వేసవికాలంలో విపరీతమైన ఎండలతో ప్రజల దాహం తీర్చడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో సోమవారం పదవవారం చిందాడగరువు ఎంపిటిసి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులచే స్పందన కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు అల్లాడుతున్న అందరికీ దాహం తీర్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉప్పలగుప్తం మండల జనసేన పార్టీ నాయకులు ఆకుల సూర్యనారాయణ మూర్తి, అమలాపురం పట్టణ ముస్లిం మైనార్టీ జనసేన నాయకులు కరిముళ్ళ బాబా, ఎంఎండి షరీఫ్, బాషా, చెల్లూరు ఎంపిటిసి గొల్లపెల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.