లోకం మాధవి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి

నెల్లిమర్ల నియోజకవర్గం, పూసపాటిరేగ మండలంలో గల ప్రధాన కూడళ్లలో జనసేన నాయకురాలు శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి భారీ స్థాయిలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. భారీ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇలాగే ప్రతిరోజు ప్రజలందరకి దాహర్తిని తీరుస్తుందని, వర్షాలు పడే వరకు ప్రతీరోజు ఈ కార్యక్రమం కొనసాగుతుందని లోకం మాధవి తెలిపారు. ఈ కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేసి జనసేన పార్టీ అధికారంలో లేకపోయినా భారీ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ, ప్రజలతో ఎప్పుడు మమేకం అయ్యి వారి కష్టాలను తెలుసుకుంటూ వారికి అండగా నిలబడింది అంటే అది ఒక్క జనసేన పార్టీ అని లోకం మాధవి లాంటి నాయకులని మేము ఇంతక ముందు ఎన్నడూ చూడలేదని ఇలాంటి వారిని గెలిపించుకుంటామని, జనసేన అంటే ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని మరొక్కసారి లోకం మాధవి నిరూపించారని తెలిపారు. ఈ సందర్బంగా లోకం మాధవి మాట్లాడుతూ ఇంతటి మహోన్నతమైన కార్యక్రమం భారీ స్థాయిలో విజయవంతంగా ముందుకు సాగుతుంది అంటే దాని వెనుక వేల మంది జనసైనికుల శ్రమ, కష్టం ఉందని, జనసైనికులు ఇలానే ప్రజలకు అందుబాటులో ఉంటూ జనసేన పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ సత్తా చాటుదాం అని పిలుపునిచ్చారు.