దుబాయిలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకి ఘన స్వాగతం

మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం దుబాయ్ విమానాశ్రయంకు చేరుకున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి ఘన స్వాగతం లభించింది. కేసరి త్రిమూర్తులు, చందక రామదాసు, కంచన శ్రీకాంత్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీల సభ్యులు నాగబాబు గారికి స్వాగతం పలికారు. ఈ నెల 26 నుండి 28 వరకు దుబాయ్ వేదికగా జరగనున్న సమావేశాల్లో శ్రీ నాగబాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్ దేశాలలో స్థిరపడిన జన సైనికులు, వీర మహిళలు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు.