ప్రజా చైతన్య యాత్ర 24వ రోజు

బొబ్బిలి నియోజకవర్గం, బాడంగి మండలంలో, వీరసాగరం గ్రామంలో జనసైనికులు ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జి గిరడా అప్పలస్వామి జనసేన పార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 24వ రోజు కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఇంటింటా పర్యటించి 4 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ ఉపాధి హామీ పనులు దగ్గరకి వెళ్లి గ్రామ ప్రజల నుండి సమస్యలు తెలుసుకొని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇందులో బొబ్బిలి నియోజకవర్గం మరియు బాడంగి మండల జనసైనికులు పాల్గొన్నారు.