జన సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఇంటిపల్లి ఆనందరాజు

రాజోలు మండలం, చింతలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ శ్రీమతి మట్టా ప్రసన్న సురేష్ అధ్యక్షతన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, ఏడీబీ రాజోలు బ్రాంచ్ మేనేజర్ ఎం. పద్మావతి, అకౌంటెంట్ రవిరామరావు ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వశాఖ ఆర్ధిక సేవల విభాగం వారి ఆదేశానుసారం జిల్లాలో గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు, ఉప సర్పంచ్ బి.రామకృష్ణ అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.