దక్షిణంలో 48వ రోజుకు చేరిన పవనన్న ప్రజాబాట

వైజాగ్ సౌత్: విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపట్టిన పవనన్న ప్రజాబాట కార్యక్రమం శనివారం నాటికి 48వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో డాక్టర్ కందుల నాగరాజు పర్యటించారు. ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెళ్లిన ప్రతిచోట ఆయనకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఈ సందర్భంగా 32వ వార్డు పూతివారిమాన్యం వీధిలో పుష్పవతి అయిన అమ్మాయి మహాలక్ష్మికి పట్టు బట్టలను అందజేశారు. అలాగే 36వ వార్డు సున్నపువీధిలో పుష్పవతి అయిన అమ్మాయి హాసినికి కూడా పట్టుబట్టలను అందజేశారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి తన సాయం అందుతుందని అన్నారు. నిరుపేదలందరికీ తన పరిధి మేరకు వారికి అవసరమైన సహాయం చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా తాను చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన వస్తుందన్నారు. దక్షిణ నియోజకవర్గంలో తన సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. జనసేన పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. జనసేన పార్టీ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు అంతోని, రామకృష్ణ, వర, శ్రీదేవి, కోదండ, మంగ, లలిత, రాజేశ్వరి, హేమ, దుర్గ, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.