రౌడీ రాజకీయం చేస్తున్న జగన్ రెడ్డి అతి పెద్ద పెత్తందారి.. వైసిపి వింత ప్రచారానికి జనసేన ధీటైన సమాధానం

  • వైసీపీ నియంత పాలన పైన యుద్ధం మన ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచే మొదలుపెడదాం

ఉమ్మడి విజయనగరం జిల్లా: పేదలకు పెత్తందార్లుకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ ఈ జగన్ ప్రభుత్వం చేస్తున్న వింత ప్రచారాన్ని దుయ్యబడుతూ సోమవారం ఉదయం 11:00 గంటలకు విజయనగరం, బాలాజీ జంక్షన్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ పిచ్చ వైసిపి పార్టీ వింత పోకడలను నిరసిస్తూ వినూత్నమైన ప్రదర్శన ద్వారా ధీటైన సమాధానం చెప్పడం జరిగింది. పాపం కసాయి వాడు, రక్త రచన, దౌర్జన్యపు నిర్వహణ, నరహంతక దర్శకత్వం: జగన్ అంటూ వైసిపి వారి ఫ్లెక్సీల పక్కనే జనసేన పార్టీ తరపున ఫ్లెక్సీలు పెట్టి, చుట్టూ పెత్తందార్లను పెట్టుకుని రౌడీ రాజకీయం చేస్తున్న జగన్ రెడ్డి అతి పెద్ద పెత్తందారి అని, 2024లో జగన్ & పెత్తందార్లకు పేదల తరపున నిలబడి పోరాడుతున్న జనసేన పార్టీ మధ్యనే ప్రధాన ఎన్నికల యుద్ధం జరగబోతుందని, పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక సీట్లిచ్చి ప్రజలే గెలవనున్నారని ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మర్రాపు సురేష్, జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, మిడతాన రవి కుమార్, ఆదాడ మోహన్, మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, అప్పారావు, మరడాన రవి, రమేష్ రాజు, చక్రధర్ నాయకులు ఆదినారాయణ, కలిగి అప్పారావు, శ్రీను తదితర జనసైనికులు పాల్గొన్నారు.