దండువారుఎల్లమ్మ జాతరలో పాల్గొన్న రామ శ్రీనివాస్

రాజంపేట నియోజకవర్గం, టి.సుండుపల్లి మండల పరిధిలో భాగంపల్లి పంచాయితీపరిధిలోని కుంటలముందర గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ దండువారుఎల్లమ్మ వారి జాతర సందర్భంగా వివిధ రకాల సాంస్కృతి సంప్రదాయం ప్రకారం విద్యుత్ దీపాలంకరణలతో చాందనిబండ్లు, చక్కభజనలు, డప్పువాయిద్యాలు, బాణసంచాలతో అంగరంగ వైభవంగా చుట్టు పక్కల గ్రామస్థులు అందరూ కలిసి భక్తులు, మొక్కులు చెలించుటకు ఘనంగా జాతర మహోత్సవం నిర్వహించారు. ఈ జాతర మహోత్సవాలలో జనసేన నాయకులు రామ శ్రీనివాస్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత ఎర్రంరెడ్డి, మాజీ సర్పంచ్ రాము నాయక్, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, జనసైనికులు, స్థానికులు, గ్రామస్థులు, యువకులు, భక్తులు, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.