మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు మృతి పట్ల పితాని బాలకృష్ణ సంతాపం

ముమ్మిడివరం: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయం వద్ద తాళ్ళరేవు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. 2004 నుండి 2009 వరకు తాళ్ళరేవు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వెంకటేశ్వర్లు సేవలు అందించారు. ఆయన భౌతికంగా లేకపోయినా మంచితనం ప్రజల మనస్సుల్లో సుస్థిరంగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియచేశారు. వారితో సానబోయిన మల్లికార్జున రావు, గోదశి పుండరీష్,జక్కంశెట్టి పండు, గోలకోటి వెంకన్న బాబు, దూడల స్వామి, అత్తిలి బాబురావు, పితాని రాజు తదితరులు సంతాపం వ్యక్తం చేసారు.