భీమదేవరపల్లి జనసేన మండల నాయకులతో తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్ నియోజకవర్గం, భీమదేవరపల్లిలో జనసేన మండల నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మండల స్థాయి మరియు గ్రామ స్థాయి కమిటీలు వేయడం జరుగుతుంది. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడుతూ, నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు అవకాశం కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా అన్ని గ్రామాల్లో కమిటీలు వేసి పార్టీ బలోపేతం చేయాలని, ప్రతి సమస్యలపై పోరాటం చేస్తూ, అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను పార్టీ సిద్ధాంతాలను బలంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించడం జరిగింది‌. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్, మండల నాయకులు జయిక్రిష్ణ, అనిల్, శ్రీధర్, విక్రమ్, ప్రణయ్, పవన్, శివ అమర్ తదితరులు పాల్గొన్నారు.