ప్రభుత్వ ఉద్యోగుల నిరవదిక నిరసనకు జనసేన మద్దతు

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంగం (ఏపీజీఈఏ) వారి ఆధ్వర్యంలో ఉద్యోగుల యొక్క హక్కులను కాలరాస్తున్న వైసీపీ ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ ఉద్యోగుల దశల వారి ఆందోళనన్లో భాగంగా మంగళవారం కరప మండలం, కరప గ్రామంలో తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ చేస్తున్న నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పాల్గొని వారికీ జనసేన పార్టీ తరపున మద్దతు ప్రకటించి, ఉద్యోగుల సమస్యలను జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తామని ఉద్యోగులకు తెలియచేసారు.