వీరభద్ర స్వామి ఆలయ భూములను కాపాడండి – తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్ నియోజకవర్గం: భీమదేవరపల్లి మండలం, కొత్త కొండ గ్రామంలో గల ప్రసిద్ధి గాంచిన వీరభద్ర స్వామి ఆలయమునకు సంబంధించిన భూములు రోజు రోజుకు అన్యక్రాంతమైపోతున్నాయని, ఆరోపిస్తూ దేవాలయ భూములపై సమగ్ర సర్వే జరిపి భూములను పరిరక్షించాలని జనసేన హుస్నాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేవాదాయశాఖ మరియు రెవెన్యూ శాఖలు సర్వే చేయకపోవడం ప్రధాన కారణం అని అన్నారు. వెంటనే ఆలయ భూములపై సర్వే చేపట్టి భూకబ్జా దారుల నుండి భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నద్దునూరి జయక్రిష్ణ, పవన్, విక్రమ్, ప్రణయ్, అమర్ తదితరులు పాల్గొన్నారు.