జనసేన పోరాటంతో బహుదానదిపై వంతెన నిర్మాణానికి కదిలిన యంత్రాంగం

  • బహుదానదిపై వంతెన నిర్మాణానికి జనసేన పోరాటానికి విజయం

ఇచ్చాపురం నియోజకవర్గం: ఇచ్చాపురంలో గల బహుదానదిపైన వంతెన నిర్మించడం కోసం మొదటినుండి జనసేన చాలా పోరాటం చేసింది. జనసేన పోరాటంతో బహుదానదిపై వంతెన నిర్మాణానికి అధికార యంత్రాంగం కదలివచ్చింది. ఈ మేరకు వంతెన నిర్మించడం కోసం శనివారం ఎస్.ఈ జాన్ సుధాకర్, ఈ ఈ పి. సత్యనారాయణ డి ఈ ఎస్. రామి నాయుడు రావడంతో జనసేన ఇచ్చాపురం ఇంచార్జి దాసరి రాజు వారిని కలసి అక్కడ వంతెన కోసం సాయిల్ చెక్ చేసి యుద్ధప్రాతిపదికన తాత్కాలిక వంతెన నిర్మించి 2 వీలర్స్, 3 వీలర్స్ వెహికిల్ వెళ్ళడానికి వీలుగా నిర్మిస్తాం అని, జులై మొదటివారం నుండి అనుమతి ఇస్తాం అని చెప్పడం జరిగింది. పూర్తి వంతెన నిర్మించడం కోసం ప్రభుత్యానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. మొదటినుండి జనసేన వంతెన కోసం చాలా ప్రయత్నం చేసింది. ఇది జనసేన విజయంగా భావిస్తున్నాం. ఇలానే ప్రజల తరపున సమస్యల కోసం పోరాటం చేస్తాం. ఆ రోజు వంతెన కూలిన రోజు నుండి ఈ రోజు వరకూ అలుపెరుగని పోరాటం చేసింది. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇలానే పూర్తి వంతెన కోసం కూడా యుద్ధప్రాతిపదికన పనులు జరగాలి అని కోరారు.