శేరిలింగంపల్లి నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిభిరం

శేరిలింగంపల్లి: జనసేన పార్టీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కో ఆర్డినేటర్ మాధవరెడ్డి సారథ్యంలో ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి కాలని సురభి కాలని మరియు ఆర్.ఎమ్ టౌన్షిప్ వాసులు విశేషంగా పాల్గొనటం జరిగింది. ప్రభుత్వం వారు చేపట్టిన కంటి వెలుగు పథకం ప్రజలకు ఒక కంటి తుడుపు చర్యగా మారి సకాలంలో చికిత్స చేసి కంటి అద్దాలు అందిచలేకపోవటం దురదష్టకరం. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపున సుమారు 500 వందల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 359 మందికి కళ్ళ జోళ్ళు పంపిణీ చేయటం జరిగింది, ప్రభుత్వం వారు ప్రచార కార్యక్రమాలకు విరివిరిగా చేసే ఖర్చుతో నాణ్యమైన కళ్ళ అద్దాలు ప్రజలకు అందిస్తే బాగుంటుందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యక్తలు అరుణ్ కుమార్, సరోజ్ప్రదీప్, కళ్యాణ్ చక్రవర్తి, రమేష్, జి.ఎస్.కే శ్రావణ్, జయానంద్, సాహో ప్రవీణ్, ప్రశాంత్, అశోక్ కుమార్, సందీప్, లక్ష్మీనారాయణ, హర్ష, దుర్గాప్రసాద్, తదితర జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొనటం జరిగింది.