వారాహి యాత్ర నేపథ్యంలో వైసీపీ నేతల గుండెల్లో గుబులు

మదనపల్లి: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ నేతల గుండెల్లో గుబులు పట్టుకుందని, జూన్ 14 నుండి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కావడంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని, జనసేన పార్టీ ఆఫీస్ లో జనసేన రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారహి యాత్ర కోసం మదనపల్లి నియోజకవర్గం నుండి నిరంతరం 10 మంది వాలంటీర్స్ వెళుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ విభాగ నాయకులు జగదీష్, మదనపల్లి రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, సనా ఉల్లా, రెడ్డెమ్మ, కుమార్, జనర్దన్, లక్ష్మీపతి, మోహన, నాగ, నవాజ్, శేఖర, హరికృష్ణ, విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.