అగ్నిప్రమాద బాధితులకు వేమూరు జనసేన ఆర్ధిక సహాయం

వేమూరు: అబ్బనగూడవల్లి గ్రామంలో అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బొందలపాటి వెంకటనారాయణకు వేమూరు జనసేన పార్టీ తరపున 15500 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో వేమూరు జనసేన నాయకులు గాజుల నగేష్, దేవిరెడ్డి మహేష్, బొందలపాటి మురళి, తాటికొండ మురళి, అబ్బనగూడవల్లి జనసైనికులు కొండిశెట్టి సుబ్రహ్మణ్యం, బొందలపాటి సాయి, కిషోర్, తిరుమలశెట్టి వీరమోహనరావు, బొందలపాటి వెంకటరామయ్య, బొందలపాటి నవీన్, బొందలపాటి మహేష్, కేసంశెట్టి సునీల్, బోడపాటి వంశీ, తిరుమలశెట్టి పుష్పావతి, అనూష, వెంకటేశ్వరరావు, వెంకటరమణ, హరిరామ జోగయ్య, మరియు వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా బాధితులని ఆదుకుని ఇంటి నిర్మాణం కోసం సహాయం అందించాలని జనసేన నాయకులు విజ్ఞప్తి చేశారు.