జనసేన కార్యకర్త హనుమంతు కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు
కొత్త గూడెం: జనసేన కార్యకర్త బోడ హనుమంతు తండ్రి బోడ భీముడు ఇటీవలే అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది. కొత్తగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున వారి కుటుంబసభ్యులను పరామర్శించి, భీముడు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్తగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్ వేముల కార్తీక్, పాల్వంచ మండల అధ్యక్షులు ఓలపల్లి రాంబాబు, ఉపాధ్యక్షులు సంపత్, సోషల్ మీడియా సెక్రెటరీ షేక్ బాషా, ప్రహర్షిత్ తదితరులు పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-06-at-4.57.27-PM-1-1024x768.jpeg)