వాటర్ స్ప్రింక్లింగ్ చేయించండి: జనసేన వినతి పత్రం

  • రోడ్లు ఎలాగూ త్వరితగతిన పూర్తి చేయలేరు, కనీసం దుమ్ము ధూళి ఎగరకుండా వాటర్ స్ప్రింక్లింగ్ అయినా చేయించండి- మున్సిపల్ ఆఫీస్ లో జనసేన నేత బాబు పాలూరు

బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ కు గురువారం బొబ్బిలి పట్టణంలోని రోడ్ల అధ్వాన్నమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, వేణుగోపాల స్వామి గుడి నుంచి చెరువు గట్టు వరకు జరుగుతున్న రోడ్డు వైడినింగ్ పనులు వలన మరియు బొబ్బిలి ఆర్.టి.సి కాంప్లెక్స్ నుండి పూల్ బాగ్ మీదుగా దాడితల్లమ్మ కోవెల వరుకు గల గుంతల రోడ్డు వలన దుమ్ము, ధూళి ఎగురుతుండటంతో ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యపై తక్షణమే ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ వారు రోడ్డు కాంట్రాక్టర్ తో మాట్లాడి వాటర్ స్ప్రింక్లింగ్ చేయించాలని, అలాగే అధ్వాన్నంగా ఉన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చెయ్యాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగధర్ జనసేన తరఫున వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బెవర గణేష్, గేదెల శివ, వాండ్రాసి వెంకటరమణ, రేవెళ్ల కిరణ్, చీమల సతీష్, సంతోష్, ఈశ్వర్, పైల సాయిరాం పాల్గొన్నారు.