బొబ్బిలి నియోజకవర్గ సమస్యల చర్చా వేదిక

బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలి జనసేన ఇన్చార్జ్ డాక్టర్ గిరడ అప్పల స్వామి ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ వింగ్ సభ్యులు గేదెల సతీష్ కుమార్ అధ్యక్షతన ఆదివారం ఉదయం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి బొబ్బిలి నియోజక వర్గ సమస్యల చర్చా వేదిక అని నామకరణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి, బిజెపి, లోక్ సత్త, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ నాయకులు మరియు వర్తక సంఘ నాయకులు, చెరువుల పరిరక్షణ సమితి నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, కార్మిక సంఘ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు, రైతు సంఘ నాయకులు, ఆటో, రిక్షా యూనియన్ నాయకులు, మత్స్యకార సంఘ నాయకులు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంతటి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా డాక్టర్ గిరడ అప్పల స్వామి ధన్యవాదాలు తెలియజేశారు.