వారాహి యాత్ర విజయవంతం కావాలి: కదిరి జనసేన

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర విజయవంతం కావాలని భైరవేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

కదిరి: జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీన చేపట్టిన వారాహి రథ యాత్ర దిగ్విజయం పొందాలని, ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులు కలగాలని, కదిరి పట్టణానికి క్షేత్ర పాలకుడు భైరవేశ్వర స్వామి కృప కలగాలని కదిరి ఇంచార్జీ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వించి 101 కొబ్బరి కాయలు కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కాయల చలపతి, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, నల్లచెరువు మండల నాయకులు రవి కుమార్, తలుపుల మండల నాయకులు అన్నం జయవర్ధన్, లీగల్ సెల్ రవి, 34వ వార్డ్ ఇంచార్జీ హరి బాబు, నాగరాజు, సోమశేఖర్, మనోహర్, హరీష్ వాల్మీకి, ఐనొద్దీన్, చంద్ర శేఖర్, ప్రతాప్, గణేష్, చక్రి, సురేష్, ప్రసాద్, 34వ వార్డ్ జనసైనికులు, 20 వార్డ్ జన సైనికులు, కార్యకర్తలు పెద్దయెత్తున పాల్గొన్నారు.