క్రాక్ ప్రీమియర్ షోస్ రద్దు..
గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మాస్ రాజా రవితేజ. అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా బాక్సాపీస్ వద్ద పరాజయాన్ని చవిచూశాయి. దీంతో తన ఆశలన్నీ గోపీచంద్ మలినేనితో తీస్తున్న క్రాక్ సినిమాపైనే పెట్టుకున్నాడు.
ఓ వైపు కరోనా ప్రభావం థియేటర్లకు జనాలు రాకపోవడం, మరోవైపు ప్లాప్స్ సినిమాలు ఉండటంతో నిర్మాత ఠాగూర్ మధుకు క్రాక్ ఎలా కలిసొస్తుందోనని అంతా అనుకున్నారు. కానీ అభిమానులకు షాక్ తగిలింది. కొన్ని అనివార్య కారణాల వల్ల క్రాక్ షోలు నిలిచోయాయి. దాంతో సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులు నిరాశ చెందారు. ఎందుకు ఏంటనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.