వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని ప్రత్యేక ప్రార్ధనలు

డా.బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలంలో వారాహి కోసం మసీదులో ప్రత్యేక ప్రార్ధనలు మంగళవారం నగరం పంజా మసీదులో వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాస రాజా, కొమ్ముల జంగమయ్య ఎంపీటీసీ, కార్యదర్శిలు కొమ్ముల భద్రం, కాట్రేనిపాడు నాగేంద్ర, యెరుబండి చిన్ని, సర్కిల్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.