వారాహి యాత్రకు మద్దతుగా అన్నవరంలో భారీ పాదయాత్ర

  • వారాహి సంఘీభావ యాత్ర

పిఠాపురం: జూన్ 14వ తేదీ బుధవారం పత్తిపాడు నియోజవర్గంలో జరిగే వారాహియాత్రలో భాగంగా కత్తిపూడి బహిరంగ సభకు మద్దతుగా మంగళవారం పత్తిపాడు నియోజవర్గం అన్నవరం గ్రామంలో జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, జనసైనికులు, కలిసి భారీ పాదయాత్ర నిర్వహించారు. ముందుగా అన్నవరం గ్రామంలో ఎస్.ఆర్ కళ్యాణమండపం నుంచి పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్తలు జనసైనికులు కలిసి పత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ వరపుల తమ్మయ్య బాబు ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు మేడిచెట్టి సూర్యకిరణ్ [బాబి] ఆధ్వర్యంలో చిలకం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర జంక్షన్ జనరల్ సెక్రటరీ మరియు పత్తిపాడు నియోజకవర్గ వారాహియాత్ర పరిశీలకులు, మరో పరిశీలకులు అక్కల గాంధీ ముఖ్య అతిథులుగా పిఠాపురం నియోజవర్గం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ అతిథులుగా పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కర్ణం సుబ్రహ్మణ్యం, జిల్లా జనసేన కార్యదర్శి నల్లాల రామకృష్ణ, శంఖవరం మండల జనసేన అధ్యక్షులు గౌతు సుబ్రమణ్యం, పత్తిపాడు మండల జనసేన అధ్యక్షులు రామిశెట్టి కామేష్ జ్యోతుల సీతారాం బాబు, మేడిపోయిన సత్యనారాయణ, జ్యోతుల గోపి, అల్లం దొరబాబు, మేడిబోయిన హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.