జికె ఫౌండేషన్ సంయుక్త జనసేన ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాల అందజేత

వైజాగ్ సౌత్: జికె ఫౌండేషన్ సంయుక్త జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే విద్యా జ్యోతి అనే కార్యక్రమంలో భాగంగా నలుగురు విద్యార్థులకు స్కూల్ పాఠ్య పుస్తకాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జికె ఫౌండేషన్ ఛైర్మన్, జనసేన దక్షిణ నియోజకవర్గం నాయకులు గోపి కృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం నన్ను ముందుండి నడిపిస్తున్న జికె ఫౌండేషన్ సభ్యులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.