వారహి యాత్రను విజయవంతం చెయ్యండి: మర్రాపు సురేష్

జనసేన పార్టీ అధినేత శ్రీ పవణ్ కళ్యాణ్ చేపట్టబోయే వారాహి యాత్ర విజయవంతం కావాలని మంగళవారం గజపతినగరం నియోజకవర్గం, గంట్యాడ మండలం, నరవ గ్రామంలో గజపతినగరం నియోజకవర్గ జనసేన నాయకులు మర్రాపు సురేష్ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని, పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు డా. మిడతాన రవికుమార్, గంట్యాడ మండల అధ్యక్షుడు సారథిఅప్పలరాజు, రాంబాబు, జానీ, బద్రి, బాలుయాదవ్, నాయుడు, ముత్యాల రాజు, ప్రశాంత్, గౌరీ నాయుడు, నర్సింగ్, రామకృష్ణ, సత్యనారాయణ, సతీష్, భాను, వెంకట ప్రసాద్, శ్రీను నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.