‘‘సంతోషం” అవార్డ్స్‌ ఫంక్షన్‌ ప్రకటన త్వరలోనే

పత్రికాధినేత సురేష్‌ కొండేటి ప్రతి సవత్సరం ‘సంతోషం’ అవార్డుల వేడుకని ఘనంగా నిర్వహిoచే సంగతి అందరికీ తెలిసిన విషయమే. ‘‘సంతోషం’ సినీ వారపత్రిక నేటితో 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగుపెడుతోoది. ఈ ఏడాది వేడుక గురించి సురేష్‌ మాట్లాడుతూ ‘‘సంతోషం అవార్డ్స్‌ ఫంక్షన్‌ ఎప్పుడు అనేది ప్రతి ఏటా ఆగస్టు 2న ప్రకటించడం, అదే రోజు కర్టెన్‌రైజర్‌ ఫంక్షన్‌ కూడా చేయడం జరిగేది కానీ కరోనా వల్ల ఈసారి ఈ ఫంక్షన్‌ కాస్త ఆలస్యం అవుతుంది, కానీ సంతోషం వేడుక ఖచ్చితంగా నిర్వహిస్తాము. సామాజిక దూరం పాటిస్తూ తక్కువ మందితో ఫంక్షన్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎప్పుడు? ఎక్కడ? అనేది అతి త్వరలోనే ప్రకటిస్తాం. ప్రతి ఏడాది ఈ ఫంక్షన్‌లో పేద కళాకారులకు సహాయం చేస్తున్నాం. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న చిత్ర పరిశ్రమలోని కొంతమందికి సహాయం చేసేలా ఈ ఏడాది ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.