వారాహి యాత్ర విజయవంతం కావాలని మస్తాన్ వలీ దర్గాలో ప్రత్యేక ప్రార్దనలు

గుంతకల్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి యాత్ర విజయవంతం కావాలని గుంతకల్లు నియోజకవర్గం జనసేన పార్టీ మైనారిటీ నాయకులు జిలాన్ బాషా, ఫిరోజ్ ఖాన్ అధ్వర్యంలో మస్తాన్ వలీ బాబా దర్గా లో ప్రార్ధించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వై ఎస్ ఆర్ సీ పీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు స్వస్తి పలికేందుకు “వారాహి” ద్వారా నాంది పలికేందుకు “అన్నవరం సత్యనారాయణ స్వామి” సన్నిధి నుండి ప్రారంభం కానున్న సందర్భంగా గుంతకల్లు నియోజకవర్గం నందు ముస్లిం మైనారిటీ నాయకులు, కార్యకర్తల అధ్వర్యంలో “వారాహి” యాత్ర అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఈ అరాచక పాలన నుండి రాష్ట్ర ప్రజలు విముక్తి పొందాలని “ప్రముఖ పుణ్యక్షేత్రం మస్తాన్ వలీ దర్గా” నందు ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కర్యనీర్వహన కమిటీ సభ్యుడు అమీర్ సొహిల్, మారుతీ కుమార్ యాదవ్, బోయ వీరేష్, తాడిపత్రి మహేష్, రవి తేజ పాల్గొన్నారు.