జనసేన బైక్ ర్యాలీలో పాల్గొన్న మాకినీడి, జ్యోతుల
- కత్తిపూడి బహిరంగసభకు మద్దతుగా జనసేన బైక్ ర్యాలీలో పాల్గొన్న జనసేన పిఠాపురం జనసేన ఇన్చార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి, జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు
పిఠాపురం నియోజవర్గం: జూన్ 14వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు కత్తిపూడి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జరిగే వారాహి యాత్ర బహిరంగ సభకు విచ్చేయుచున్న జనసేనాని పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు మద్దతుగా పిఠాపురం నియోజవర్గం నందు గల జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు బైక్ ర్యాలీ, కారు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీను చేబ్రోలు గ్రామంలో పిఠాపురం జనసేన ఇన్చార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి, జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసుకలిసి ప్రారంభించి, బైక్ ర్యాలీతో పాటుగా శ్రీమతి మాకినేని శేషుకుమారి, జ్యోతుల శ్రీనివాసు కత్తిపూడి బహిరంగసభకు తరలి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు గొల్లప్రోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు అమరావతి వల్లి రామకృష్ణ, గోపి సురేష్, అల్లం దొరబాబు, దిబ్బిలి సురేష్, ఓరుగంటి పెద్ద, పెద్దింటి శివ, బుద్ధాల చంటి, బుద్దాల దివాణం మరియు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-14-at-7.48.26-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-14-at-7.48.26-PM-1-1024x576.jpeg)