వారాహి యాత్రకు సంఘీభావంగా సత్తెనపల్లిలో జనసేన పాదయాత్ర

సత్తెనపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బుధవారం 14వ తారీకు నుంచి వారాహి యాత్ర నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారాహి యాత్రకు సంఘీభావం తెలుపుతూ.. మంగళవారం సత్తెనపల్లి పట్టణంలో నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఉదయం బెల్లంకొండ రోడ్ లో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి వారికి రాజుపాలెం మండలం జనసేన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి యాత్ర విజయవంతం కావాలని ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రయోజనాల పరిష్కార అన్వేషణకై జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి యాత్రలో బహిరంగ సభలతో పాటు ప్రతి నియోజకవర్గంలో జనవాణీ కార్యక్రమాలు కూడా ఉంటాయని.. సమస్యలతో కష్టాలు పడుతున్న ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకొని ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేసే విధంగా ఈ యాత్ర కొనసాగుతుందని.. ఈ వారాహి యాత్ర రాష్ట్ర ప్రజలలో చైతన్యం ధైర్యం నింపుతాయని ఆశాభోవం వ్యక్తం చేస్తున్నామని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, తిరుమల శెట్టి మల్లేశ్వరి, బీరవల్లిపాయ సర్పంచ్ పసుపులేటి వెంకటస్వామి, దమ్మాలపాడు ఎంపీటీసీ సిరిగిరి రామారావు, నియోజకవర్గ నాయకులు రాడ్లు శ్రీనివాసరావు, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ బత్తిన శీను, రాజుపాలెం మండలం నాయకులు అంచులు అనూష్, వివిధ మండలాల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల గ్రామ అధ్యక్షులు, నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.