స్వాతి కుటుంబానికి అండగా నిలచిన జనసేన

మదనపల్లి: ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందనడానికి ఉదాహరణ మదనపల్లి మండలం వేంపల్లి పంచాయతీ హరిజనవాడలో జరిగిన సంఘటన. హరిజనవాడకి చెందిన అదేమ్మ, కదిరిప్ప కూతురు స్వాతిపై వైసిపి గుండాలు దాడి చేసి, దుర్భాషలాడి, ఆ అవమానాన్ని భరించలేక అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితికి వచ్చింది. విషయం తెలుసుకున్న మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగరపు రాందాస్ చౌదరి పరామర్శించి వారి కుటుంబానికి గ్రామ ప్రజలకి అండగా జనసేన పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు. స్వాతి వైద్య ఖర్చులకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి జిల్లా మంత్రి నుంచి ఏమ్మెల్యే నుంచి గ్రామంలో కార్యకర్త వరకు దౌర్జన్యాలు, దాడులు చేయడం జరుగుతుందని పోలీస్ శాఖ వారు వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని అవసరం ఐతే జనసేన పార్టీ తరుపున హైకోర్టు వరకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జంగాల శివరాం రాయల్, గడ్డం లక్ష్మీపతి, రెడ్డెమ్మ, శేఖర, రామక్రిష్ణ, కదిరిప్ప, అదేమ్మ, రవి, శివ, నరసింహులు, వెంకటరమణ, రఘు, నల్లప్ప తదితరులు పాల్గొన్నారు.